Wednesday 3 August 2016

నిన్న 2-8-2016 సాయంత్రం 5-00 గంటలకు  హైదరాబాద్ లోని సి.పి.యం.జి. ఆఫీసులో జి.డి.యస్ కమిటీ శ్రీ కమలేష్ చంద్ర కమిటీతో మన యూనియన్ నాయకులు సర్కిల్ కార్యదర్శి కామ్రేడ్  బి.వి.రావు గారు,సర్కిల్ ప్రెసిడెంట్ బి.జయరాజు గారు, సర్కిల్ సహాయ కార్యదర్శులు మసూద్ హుస్సేన్ గారు, వై.మర్రెడ్డి గారు మీటింగ్ లో పాల్గొన్నారు.ప్రతి జి.డి.యస్.కు 8-00గంటలు పని కల్పించి 8-00 గంటలుకు సరిపడ జీతం ఇవ్వాలని,జి.డి.యస్ లను రెగ్యులర్ చేసి రెగ్యులర్ ఉద్యోగులకిస్తున్న అన్ని సదుపాయాలు కల్పించాలని గట్టిగా డిమాండ్ చేశారు. జి.డి.యస్ లకు సరైన న్యాయం చేస్తామని కమిటీ వారు గట్టినమ్మకం ఇచ్చారు. తర్వాత మన నాయకులు కమిటీ ఛైర్మన్,సెక్రటరీని దుశ్శాలువలుతో సన్మానించారు...... కె.బి.మీరావలి,రాష్ట్ర సహాయ కార్యదర్శి.





No comments:

Post a Comment