Monday 12 February 2018

జి.డి.యస్ పేకమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ AIGDSU పోరాట కార్యక్రమాలు...                                       (1) ది 19-02-18 సోమవారం నుండి ది 24-2-18 శనివారం వరకు జి.డి.యస్ లందరూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలియజేయాలి.            (2). ది. 15-03-2018 గురువారం న్యూఢిల్లీ లో ప్రధాన మంత్రి నివాసం వద్ద 10 వేలమంది జి.డి.యస్ ఉధ్యోగులతో మాస్ ధర్నా నిర్వహించబడుతుంది.         జి.డి.యస్ కమిటీ రిపోర్ట్ ను అమలు చేయటంలో తపాలాశాఖ చూపుతున్న నిర్లక్షంతో 2 లక్షల 70వేలు మంది జి.డి.యస్ ఉద్యోగులు విసిగి పోయారు. జి.డి.యస్ ల సహనాన్ని తపాలాశాఖ ఎంతకాలం పరీక్షించదలుచుకుందో మనకు తెలియదు. జి.డి.యస్ కమిటీ రిపోర్ట్ అమలు చేయడంలో జరుగుతున్న తీవ్రమైన ఆలస్యంతో జి.డి.యస్ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. జి.డి.యస్ ల అసంతృప్తి, నిరసన, కోపం పరిగణనలోకి తీసుకోని  AIGDSU పై పోరాటకార్యక్రమాన్ని రూపొందించింది. జి.డి.యస్ కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని AIGDSU డిమాండ్ చేస్తుంది.                           పోరాటాభినందనలతో......                                                 బి.వి.రావు MA(Litt) కేంద్ర సంఘ సహాయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, AIGDSU.

No comments:

Post a Comment